Nagachaitanya:దడ పుట్టిస్తున్న తండేలు..ఆ ఒక్క సీన్ కు 900మంది.!

అక్కినేని నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ తండేల్.  పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రానికి చందు మొండేటి డైరెక్షన్ వహిస్తున్నారు.  శరవేగంగా


Published Aug 27, 2024 12:02:18 PM
postImages/2024-08-27/1724740338_thandell.jpg

న్యూస్ లైన్ డెస్క్: అక్కినేని నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత బడ్జెట్ తో రూపొందుతున్న మూవీ తండేల్.  పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవ్వబోతున్న ఈ చిత్రానికి చందు మొండేటి డైరెక్షన్ వహిస్తున్నారు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం దాదాపు 70 కోట్లకు పైగా బడ్జెట్ తో, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై  బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారట. ఇక ఇందులో నాగచైతన్య సరసాన సాయిపల్లవి హీరోయిన్ గా చేస్తోందని తెలుస్తోంది.  తండేలు చిత్ర కథ విషయానికొస్తే రాజు అనే ఒక వ్యక్తి యొక్క నిజజీవిత కథ ఆధారంగా కాస్త యాక్షన్ జోడించి సినిమాలు తీస్తున్నారట.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నాగచైతన్య చేపలు పట్టే వ్యక్తిగా,  సముద్రంలో చేపలో వేటకు వెళ్లి పాకిస్తాన్ వాళ్లకు దొరికి జైలులో బందీ అవుతారట. దాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా నడుస్తుందని తెలుస్తోంది. అలాంటి ఈ చిత్రంలో ఒక సీన్  హైదరాబాదులో  తెరకెక్కిస్తున్నారట. దీనికోసం భారీ ఖర్చుతో సెట్ అప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.  ఈ జాతర సీన్ కోసం మొత్తం 60 మంది కళాకారులను శ్రీకాకుళం నుంచి తీసుకువచ్చారని జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్స్ అంతా కలిపి 900 పైగానే ఉంటారని తెలుస్తోంది.

అంతేకాదు ఈ జాతర సాంగులో అదిరిపోయే బీట్ సాంగ్, అలాగే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అద్భుతంగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ఈ చిత్రాన్ని డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించారు. దీంతో ఈ సినిమాపై అక్కినేని అభిమానులందరికీ ఆసక్తి నెలకొని ఉంది. ఇందులో శ్రీకాకుళం ఫిషర్ మ్యాన్ కమ్యూనిటీ కి సంబంధించిన అమ్మాయిగా సాయి పల్లవి కనిపించబోతోంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఆమె లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరి చూడాలి నాగచైతన్యకు ఈ చిత్రమైన హిట్ ఇచ్చి పాన్ ఇండియా లెవెల్లో విజయం సాధించాలని కోరుకుందాం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya chandu-mondeti thandel saipallavi

Related Articles