Cm Revanth : కాంగ్రెస్ కండువాతో అసెంబ్లీకి సీఎం రేవంత్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. శాసనసభ ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ నిర్వహణ తేదీలను నిర్ణయించనున్నారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-23/1721713958_cmrevanth.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు శాసన సభ సంతాపం ప్రకటించింది. శాసనసభ ముగిసిన వెంటనే బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ నిర్వహణ తేదీలను నిర్ణయించనున్నారు. పదిరోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది.

 కాగా.. సీఎం హోదాలో అసెంబ్లీకి హాజరైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాతో వచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. సీఎం హోదాలో సభకు హాజరైన రేవంత్ పార్టీ కండువా ఎలా ధరిస్తారంటూ పలువురు అభ్యంతరం తెలుపుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news revanth-reddy telanganam cm-revanth-reddy assembly latest-news telugu-news assembly-budget-session

Related Articles