Maisammaguda: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద టెన్షన్ టెన్షన్..

 విద్యార్థి మరణంతో యూనివర్సిటీలో తీవ్ర దుమారం రేగుతోంది. సమయానికి హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లి ఉంటే అరుణ్ కుమార్ ప్రాణాలు దక్కేవని మృతుని బంధువులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. 


Published Aug 10, 2024 02:55:24 PM
postImages/2024-08-10/1723281924_agriculturecollege.jpg

న్యూస్ లైన్ డెస్క్: మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. నల్గొండకు చెందిన అరుణ్ కుమార్(19) అనే విద్యార్థి మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్నాడు. అయితే ,  గురువారం అరుణ్ కుమార్ క్లాస్‌ రూంలో పరీక్ష రాస్తూ స్పృహతప్పి పడిపోయాడు. 

విద్యార్థులు, సిబ్బంది సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అయితే,  అతన్ని పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. అయితే, విద్యార్థి మరణంతో యూనివర్సిటీలో తీవ్ర దుమారం రేగుతోంది. సమయానికి హాస్పిటల్‌కు తీసుకొని వెళ్లి ఉంటే అరుణ్ కుమార్ ప్రాణాలు దక్కేవని మృతుని బంధువులు యూనివర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. 

తమకు న్యాయం చేయాలంటూ కాలేజీలోని అద్దాలను, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. వారికి మద్దతుగా  ABVP, NSUI ఆధ్వర్యంలో విద్యార్థులు కూడా ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam nayak mallareddyagricultureuniversity maisammaguda

Related Articles