Panchayat Elections: పంచాయతీ ఎలక్షన్స్ ఓటర్ లిస్ట్‌కు షెడ్యూల్ ఖరారు

బుధవారం దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఈసీ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ లిస్ట్‌ను ప్ప్రచురించనున్నారు. 


Published Aug 21, 2024 05:20:10 PM
postImages/2024-08-21/1724241010_PanchayatElections.jpg

న్యూస్ లైన్ డెస్క్: పంచాయతీ ఎలక్షన్స్ కోసం ఓటర్ లిస్ట్‌ తయారు చేసేందుకు షెడ్యూల్ ఖరారైంది. బుధవారం దీనికి సంబంధించిన వివరాలను ఎస్‌ఈసీ విడుదల చేసింది. సెప్టెంబర్‌ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ లిస్ట్‌ను ప్ప్రచురించనున్నారు. 

ఓటరు జాబితాపై సెప్టెంబర్‌ 7 నుంచి 13వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నారు. సెప్టెంబర్‌ 21న వార్డుల ఫైనల్ ఓటర్ లిస్ట్ ప్రచురించనున్నట్లు అధికారులు తెలిపారు. 

సెప్టెంబర్‌ 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల స్వీకరణ స్వీకరించనున్నారు. ఓటర్ లిస్ట్ తయారీపై ఈనెల 29న కలెక్టర్లతో ఎస్‌ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌ జరగనుంది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu telanganam panchayat-elections oter-list sec election-commission

Related Articles