lawyer: కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏతో ప్రాణహాని

కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ ప్రసాద్‌తో తనకు ప్రాణ హాని ఉందని బెల్లంపల్లికి చెందిన మహిళా లాయర్ గడవీణ మమత ఆవేదన వ్యక్తం చేసింది. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండగానే ఒంటరి మహిళా పింఛన్ పొందుతున్నదని కలెక్టర్‌కు మమత ఫిర్యాదు చేసింది. దీంతో పగ పెంచుకున్న విక్టోరియా కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని వెల్లడించింది. 
 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720594495_modi70.jpg

న్యూస్ లైన్ డెస్క్: అధికారంలో ఉన్నామనే అహంకారంతో కాంగ్రెస్ నాయకులు, వారి అనుచరులు ఆగడాలకు పాల్పడుతున్నారని ఇప్పటికే పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తప్పు చేస్తే ప్రశ్నించగా అక్రమంగా కేసులు పెట్టి పోలీసులతో చిత్రహింసలు పెట్టిస్తున్నారని వాపోతున్నారు. ఇటువంటి ఘటనలు ఇప్పటికే చాలా జరిగాయి. అయితే, సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా లాయర్లు, పోలీసులు, ప్రజాప్రతినిధులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ నుండి తనకు ప్రాణహాని ఉందని ఓ మహిళా లాయర్ వాపోయింది. ఆమె నాలుగు నెలల గర్భిణీ కావడం గమనార్హం.

కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ ప్రసాద్‌తో తనకు ప్రాణ హాని ఉందని బెల్లంపల్లికి చెందిన మహిళా లాయర్ గడవీణ మమత ఆవేదన వ్యక్తం చేసింది. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీకి చెందిన చిప్పరి విక్టోరియా అనే మహిళ భర్త ఉండగానే ఒంటరి మహిళా పింఛన్ పొందుతున్నదని కలెక్టర్‌కు మమత ఫిర్యాదు చేసింది. దీంతో పగ పెంచుకున్న విక్టోరియా కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని వెల్లడించింది. 

బెల్లంపల్లిలో తిరగనివ్వనని, చంపేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ పీఏ గడ్డం ప్రసాద్ ఫోన్‌లో బెదిరిస్తున్నట్లు మమత వాపోయింది. తనకు ప్రాణహాని ఉందని, గడ్డం వినోద్ పీఏ నుండి తనకు రక్షణ కల్పించాలని కోరింది. తెలంగాణ హైకోర్టు ఎదుట తన మూడేళ్ల పాపతో నిరసన తెలుపుతూ, పిఏపై చర్యలు తీసుకోవాలని కోరింది.

newsline-whatsapp-channel
Tags : mla congress telanganahighcourt gaddamvinodkumar bellampalli lawyergadaveenamamata

Related Articles