Venu Swamy : చైతు, శోభితల గురించి సంచలన కామెంట్లు చేసిన వేణుస్వామి !

''నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు'' - ఇదీ వేణు స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో పోస్ట్ చేశాడు.


Published Aug 08, 2024 06:00:00 PM
postImages/2024-08-08/1723120380_VENUSWAMI.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: అక్కినేని నాగ చైతన్య , శోభితా ధూళిపాళ ఎంగేజ్ మెంట్ జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే వేణుస్వామి కన్ను కొత్త జంటపై పడింది. అక్కినేని ఫ్యాన్స్  ఫుల్ హ్యాపీ గా ఉంటే ...వేణుస్వామి ఆ ఆనందంపై నీరు చల్లడానికి వచ్చేశారు. ''నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు'' - ఇదీ వేణు స్వామి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంటులో పోస్ట్ చేశాడు.


సమంత, చైతన్య జంట బావుందని జనాలు దీవిస్తుంటే వేణుస్వామి మాత్రం ''చై సామ్ విడాకులు తీసుకుంటారు'' అని బాంబు పేల్చారు . ఆ తర్వాత ఆయన చెప్పింది నిజం కావడంతో తాను చెప్పేది 100 పర్సెంట్ జరుగుతుందని పబ్లిసిటీ చేసుకున్నారు. 


వేణుస్వామి చెప్పినవి కొన్ని జరగలేదు. కేసీఆర్ మళ్లీ గెలుస్తారనేది జరగలేదు. దీంతో పాటు  ప్రభాస్ కెరియర్ పోయిందన్నారు. కాని నో ...కల్కీ తో భయంకరమైన హిట్టు కొట్టాడు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోమారు అధికారం చేపడతారని కూడా చెప్పారు. ఆయన జాడే లేదు. దీంతో వేణుస్వామి ఇక జాతకాలు చెప్పనని కూడా అన్నాడుడ. మళ్లీ ఏమైందో..నాగచైతన్య ,శోభిత మీద పడ్డాడు రేపు ఆయన వీళ్లద్దరి లైఫ్ డిసైడ్ చేస్తారట.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya venuswamy

Related Articles