Vijayawada: చిన్నారిని సురక్షితంగా కాపాడిన వరద బాధితులు

విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ఓ కుటుంబం తమ చిన్నారిని రక్షించేందుకు పీకల్లోతు నీటిలో ఓ తొట్టెలో నెలల చిన్నారిని ఉంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.


Published Sep 03, 2024 07:42:19 PM
postImages/2024-09-03/1725372739_babyone.PNG

న్యూస్ లైన్ డెస్క్: గత మూడు రోజులగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక విజయవాడ నగరం మొత్తం నీటిలో మునిగింది. దీంతో అక్కడి ప్రజలు బిక్కు బిక్కు మంటూ ప్రాణాలు ఆర చేతిలో పెట్టుకొని సహాయ చర్యల కోసం ఎదుకు చూస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ సింగ్ నగర్ ప్రాంతంలో ఓ కుటుంబం తమ చిన్నారిని రక్షించేందుకు పీకల్లోతు నీటిలో ఓ తొట్టెలో నెలల చిన్నారిని ఉంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విజయవాడకు వచ్చి పర్యటించాలని వదర బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : ap-news chandrababu andhrapradesh baby floods

Related Articles