Dhanush:కేరళకు విరాళం ప్రకటించిన  ధనుష్ ఏంతంటే.?

తాజాగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో తీవ్రమైన వరద ప్రభావం వల్ల ఎంతోమంది ప్రజలు నష్టపోయారు. వందలాది మంది ప్రజలు మరణించారు.  అలాంటి వాయనాడ్ జిల్లా ప్రజలకు  వివిధ


Published Aug 11, 2024 03:13:42 PM
postImages/2024-08-11/1723369422_dhanush.jpg

న్యూస్ లైన్ డెస్క్: తాజాగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో తీవ్రమైన వరద ప్రభావం వల్ల ఎంతోమంది ప్రజలు నష్టపోయారు. వందలాది మంది ప్రజలు మరణించారు.  అలాంటి వాయనాడ్ జిల్లా ప్రజలకు  వివిధ రాష్ట్రాల నుంచి ఎంతోమంది ప్రముఖులు  హీరో, హీరోయిన్లు, రాజకీయ నాయకులు విరాళాలు ప్రకటిస్తున్నారు.  తాజాగా మలయాళ హీరో మోహన్ లాల్ మూడు కోట్ల రూపాయలు ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే ఆ తర్వాత  ప్రభాస్ రెండు కోట్లు,  చిరంజీవి రామ్ చరణ్ కలిపి కోటి రూపాయలు, అల్లు అర్జున్ 25 లక్షలు , పలువురు ప్రముఖులు వారికి తగ్గట్టుగా విరాళాలు ప్రకటించారు.

ఇదే తరుణంలో తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ధనుష్ వాయనాడ్ జిల్లా ప్రజల సహాయార్థం 25 లక్షల రూపాయల  విరాళం ప్రకటించారు.  అయితే తాజాగా ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ మూవీ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. తన చిత్రాన్ని సపోర్ట్ చేసిన వారందరికీ ఆయన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో ఉన్నటువంటి ధనుష్  వయనాడ్ ప్రజల కోసం ఆపన్న హస్తం అందించారు. ఇక వీళ్లే కాకుండా హీరో సూర్య, జ్యోతిక, సోదరుడు కార్తీ 50 లక్షలు, నయనతార విజ్ఞేశ్ 20 లక్షలు, కమలహాసన్ 25 లక్షలు రష్మిక పది లక్షలు ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : news-line dhanush wayanad kerala helping-

Related Articles