Vinod Kumar: నీట్ పీజీ పరీక్ష రద్దు వల్ల విద్యార్థులు నష్టపోయారు 

చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.


Published Jun 24, 2024 03:34:00 PM
postImages/2024-06-24/1719223440_vinodkumar.jfif

న్యూస్ లైన్ డెస్క్: దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ యూజీ రాశారు. నీట్ పీజీ నిన్న జరగాల్సింది. అయితే కేవలం పది గంటల ముందు ఆ పరీక్షను కేంద్రం వాయిదా వేసింది. దుబాయ్ నుంచి కూడ ఈ పరీక్ష రాసేందుకు వచ్చారు. చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. నీట్ పీజీ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలపై తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినప్పుడే నీట్ పీజీ పరీక్ష వాయిదా వేస్తే బాగుండేదని తెలిపారు. నీట్ యూజీలో అనేక అవకతవకలు జరిగాయని, స్వతంత్ర భారతదేశంలో జరిగిన ప్రవేశ పరీక్షల్లో అతిపెద్ద అవకతవకలు నీట్ యూజీలోనే జరిగిందని పేర్కొన్నారు. ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లోనే నీట్ ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆయన ఆరోపించారు. గొర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ విచారణ జరపాలని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారు. మరి నీట్‌పై ఈడీ దర్యాప్తు అక్కర్లేదా అని ప్రశ్నించారు. చిన్న కేసులకు ఈడీని పంపే మోడీ నీట్ అవకతవకలపై ఎందుకు రంగంలోకి దింపలేదని, సుపరిపాలన అంటే ఇదేనా నిలదీశారు. 

నీట్‌లో ఈడీ దర్యాప్తు కోసం సుప్రీం ముందు వేసిన పిటిషన్ సోమవారం విచారణకు వస్తోందని, బండి సంజయ్ గతంలో పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజి జరిగిందని ఆరోపించారు. ఒక్కో విద్యార్థికి లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని, అపుడు బండి సంజయ్ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. నీట్ 24 లక్షల మంది రాశారని, వారందరికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని బండి ఎందుకు డిమాండ్ చేయలేదని సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇపుడు ఢిల్లీలో ఉన్నారని, నీట్ నుంచి రాష్ట్రం బయటకు రావాలిఇందుకోసం రేవంత్ మంచి న్యాయవాదిని సుప్రీం కోర్టులో నియమించి రాష్ట్రం తరపున వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎంసెట్ 60 ఏండ్లుగా బాగా జరిగిందని, అదే పద్ధతి మళ్ళీ రావాలన్నారు. ఇప్పటిదాకా నీట్ ఎన్ని సార్లు లీక్ అయ్యిందో అనే అనుమానాలు వస్తున్నాయని, మన విద్యార్థులు నీట్‌తో నష్టపడుతున్నారన్నారు. రాష్ట్రాలను మునిసిపాలిటీలుగా మార్చాలనేదే బీజేపీ ఎత్తుగడ అన్ని పరీక్షలనూ కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకోవడం ఫెడరలిజంను మంట గలపడమేనాని అన్నారు. పదో తరగతికి ఇంటర్మీడియట్‌కు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సిలబస్ ఉంది. జాతీయ స్థాయిలో ఒకే పరీక్షతో అందరికీ ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. పార్లమెంటు ఈరోజే కొలువు తీరిందని, విద్యార్థులకు న్యాయం చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news bjp

Related Articles