Vinod Kumar: శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడింది

Published 2024-07-05 15:26:29

postImages/2024-07-05//1720173389_vinod2.jpg

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్ర శాసనమండలి పూర్తిగా రద్దు అయ్యే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. ఆర్టికల్ 169 ప్రకారం శాసనమండలిలో సీట్లు 40 కంటే తక్కువ ఉండకూడదని, ఆర్టికల్ 171 ప్రకారం శాసనసభ సీట్లలో 1/3 వంతు కౌన్సిల్ సభ్యులు ఉండాలన్నారు. కానీ ప్రస్తుతం శాసన మండలి ఉనికి ప్రమాదంలో పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను తొలగించడం వల్ల అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 119కి తగ్గిందని, ఇప్పుడు రాజ్యాంగ నిబంధనల ప్రకారం 1/3 అంటే కౌన్సిల్ సంఖ్య 39కి పడిపోయిందన్నారు. దీంతో తెలంగాణ కౌన్సిల్ మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. తెలంగాణ శాసనమండలి కొనసాగాలి అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలన్నారు. చంద్రబాబు ప్రస్తుతం కేంద్రంలో కీలకంగా ఉన్నారని, ఇద్దరు సీఎంలు కలిసి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపుకు కృషి చేయాలని వినోద్ కుమార్ కోరారు. తెలంగాణ ఆస్తుల విషయంలో సీఎం రేవంత్ కాంప్రమైజ్ కావద్దని కోరారు. శాసనసభ సీట్లను పెంచాలని ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 26లో స్పష్టంగా ఉందని, దీనికోసం బీఆర్‌ఎస్ మోడీని, లా మినిస్టర్‌ను కలిసి చాలాసార్లు కోరామన్నారు. కానీ మోడీ దాన్ని దాట వేశారన్నారు. అదే మోడీ కాశ్మీర్‌లో సీట్లను పెంచుకున్నారని విమర్శించారు.