Telangana : కలెక్టరేట్ పైకెక్కి రైతు ఆత్మహత్యాయత్నం

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నర్సయ్యను అనే రైతు జనగామ  కలెక్టర్ కార్యాలయం పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.


Published Jun 24, 2024 04:15:21 AM
postImages/2024-06-24/1719216216_12.jpeg

న్యూస్ లైన్ డెస్క్ : ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నర్సయ్యను అనే రైతు జనగామ  కలెక్టర్ కార్యాలయం పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సయ్య రైతు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.  రైతు ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే రేవంత్ సర్కారుకి  తన భూమి వివాదంలో ఉన్నదని దాన్ని పరిష్కరించడానికి ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో విసుగు చెందిన సమ్మయ్య ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. పురుగుల మందు తాగిన రైతు పోలీసులు ఎన్నివిధాలా కిందకి దింపడానికి ప్రయత్నించారు. కానీ అతను కిందకు దిగడానికి ససేమిరా సహకరించలేదు. దాంతో పోలీసులు బలవంతంగా  బాధితుడిని కింది దించారు. అనంతరం  జనగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana jangaom collectorate farmer suicide-attempt-

Related Articles