బొజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కమల్ రాజు డిమాండ్ చేశారు. సత్వరమే విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కలెక్టర్ని కోరారు.
న్యూస్ లైన్ డెస్క్: మధిర నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న బోజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల కమల్ రాజు జిల్లా కలెక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుచరుల ఆగడాలతో చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, బొజడ్ల ప్రభాకర్ కుటుంబాన్ని ఆదుకోవాలని కమల్ రాజు డిమాండ్ చేశారు. సత్వరమే విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కలెక్టర్ని కోరారు. ప్రభాకర్ పట్టా పాస్బుక్ ఉన్న ఆధారంగా అతని భూమి అతనికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సానుకూలంగా జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ స్పందించారు. సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ కుటుంబానికి భరోసా ఇచ్చారు.