Thummala: రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై మంత్రి ఆరా

ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ సూసైడ్‌ ఘటనపై వ్యవసాయ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-02/1719918903_ministerthum1.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో రైతు ప్రభాకర్ సూసైడ్‌ ఘటనపై వ్యవసాయ  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన భోజడ్ల ప్రభాకర్ అనే రైతు తన పొలాన్ని కొంతమంది ఆక్రమించుకున్నారని ఎమ్మార్వో, ఎస్సై ఇతర అధికారులకు తెలియజేసిన చర్యలు తీసుకోలేదని కలెక్టర్ ను కలిసేందుకు ప్రయత్నించగా సమయం అయిపోవడంతో మనస్తాపం చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్ నాకు ఆత్మహత్య చరణ్యమని పురుగుమందు తాగి మృతి చెందారు. ఈ ఘటనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పొలం పంచాయతీల కోసం ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. గ్రామాల్లో పొలం పంచాయతీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

newsline-whatsapp-channel
Tags : telangana minister farmer

Related Articles