Thungathurthi: తుంగ‌తుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక‌ మాఫియా .?

తుంగ‌తుర్తిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. శౌలిగౌరారం మండ‌లం వంగ‌మ‌ర్తి గ్రామం నుండి హైద‌రాబాద్ కు వంద‌ల కొద్దీ లారీల్లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రోడ్డుపై దారి పొడుగునా లారీలు ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 


Published Sep 07, 2024 04:11:30 PM
postImages/2024-09-07/1725705690_Untitleddesign6.jpg

తుంగ‌తుర్తిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. శౌలిగౌరారం మండ‌లం వంగ‌మ‌ర్తి గ్రామం నుండి హైద‌రాబాద్ కు వంద‌ల కొద్దీ లారీల్లో అక్ర‌మంగా ఇసుక త‌ర‌లిస్తున్న‌ట్టు తెలుస్తోంది. రోడ్డుపై దారి పొడుగునా లారీలు ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న కంఠంలో ప్రాణం ఉండ‌గా దోసెడు ఇసుక కూడా పోనివ్వ‌ను అని మాట్లాడిన ఎమ్మెల్యే మందుల సామేలు ఎక్క‌డ ఉన్నారంటూ..? ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాద‌రి కిశోర్ మూసీలో ఉన్న ఇసుక‌ను మాత్ర‌మే చూశార‌ని, తాను మాత్రం ఇసుక కింది నీళ్ల‌ను చూశాన‌ని వ్యాఖ్యానించారు. కానీ ఇప్పుడు ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో అక్ర‌మ ఇసుక ర‌వాణా చేస్తున్నార‌ని ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. అధికారులు కూడా చూసి చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : congress-government

Related Articles