ల్యాండ్ టైటిల్ యాక్ట్ భయంకరమైన యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: ల్యాండ్ టైటిల్ యాక్ట్ భయంకరమైన యాక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేస్తామని తను, పవన్ కల్యాణ్ హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం నల్ల చట్టాన్ని రద్దు చేయడానికి బిల్లు పెట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా భూ వివాదాలు పెరిగాయి అని తెలిపారు. 40 ఏళ్లుగా తన నియోజకవర్గంలో ఒక్క పిర్యాదు రాలేదని, కానీ గట్ట ఐదేళ్లుగా తన నియోజకవర్గంలో భూవివాదాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి అని తెలిపారు. టెక్నాలజీ చాలా ప్రమాదమని, భూమి వారసత్వ ఆస్తి అన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలపై కూడా సీఎం ఫోటో వేశారు. భూ సర్వేతో డబ్బులు ఖర్చు పెట్టి వివాదాలు పెంచారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి వ్యక్తులను వేసేలా ఉందని సీఎం చంద్రబాబు అన్నారు.