Newsline telugu: రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టుల ఆందోళన

ప్రజా సమస్యలు వస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదు.


Published Aug 26, 2024 02:54:57 AM
postImages/2024-08-26//1724653019_newslineprotestatrahulgandhihome.jpg

న్యూస్ లైన్ ఢిల్లీ: ఢిల్లీలోని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇంటి ముందు తెలంగాణ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. తెలంగాణలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులకు నిరసనగా న్యూస్ లైన్ తెలుగు టీం జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు. తమపై జరుగుతున్న వరుస దాడులను ఇప్పటికైనా ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉదయం జర్నలిస్టులు శంకర్, ప్రభాకర్, లింగస్వామి, ప్రవీణ్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటి ముందు, జంతర్ మంతర్ వద్ద ఆందోలన తెలిపారు. 

తెలంగాణలో వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జర్నలిస్ట్ శంకర్ మాత్రమే కాకుండా పలువురు మహిళా జర్నలిస్టులపై కూడా దాడులు జరిగాయి. రైతు రుణమాఫీ, రైతు బంధు గురించి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ తెలంగాణ వచ్చి వీధుల్లో ప్రేమను పంచుతా అన్నారు..కానీ పరిస్థితులు అలా లేవని జర్నలిస్టులు వాపోతున్నారు. 

రాహుల్ గాంధీని కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని వచ్చామని జర్నలిస్ట్ శంకర్ వెల్లడించారు. కానీ, అనుమతించకపోవడంతో రాహుల్ ఇంటి ముందు తమ సమస్యలపై నిరసన తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్ర జర్నలిస్టులు పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. అలా చేస్తే మాపై కేసులు పెట్టుకోవచ్చని అన్నారు. ప్రజా సమస్యలు వస్తవాలను వెలుగులోకి తెస్తున్నందుకు దాడులు చేయడం సరికాదని అన్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులే దాడులు చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి పరిస్థితి తెలిపేందుకు ఢిల్లీ వచ్చామని అన్నారు. ఇప్పటికే తెలంగాణ డీజీపీ జితేందర్‌కి ఫిర్యాదు చేశామని అన్నారు. మేము ఏ రాజకీయ పార్టీ కోసం పనిచేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పని చేస్తున్నామని తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : telangana news-line newslinetelugu rahul-gandhi delhi journalist jantharmanthar attack-on-lady-journalists journalist-shankar

Related Articles