Telangana: నిద్రిస్తున్న విద్యార్థులను కరిచిన ఎలుకలు.. 13 మందికి గాయాలు


Published Sep 01, 2024 12:06:32 PM
postImages/2024-09-01/1725172592_IMG20240901115921640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : నల్లగొండ జిల్లా దేవరకొండ గురుకుల హాస్టల్లో విద్యార్థులను ఎలుకలు కరిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం దేవరకొండ లోని కొండభీమనపల్లి గురుకుల పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిద్రిస్తున్న విద్యార్థులను ఎలుకలు కరవడంతో 13 మందికి గాయాలయ్యాయి. ఉదయం గమనించిన సిబ్బంది విద్యార్థులను దవాఖానాకు తీసుకెళ్లారు. రెండు రోజుల క్రితం ఘటన జరిగినా గురుకుల పాఠశాల సిబ్బంది ఈ విషయం గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం చేరడంతో వారు హాస్టల్ దగ్గరకు చేరుకొని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు హాస్టల్ ను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎలుకలు కరిస్తే ఆ విషయం వారి తల్లిదండ్రులకు తెలియకుండా ఎలా దాస్తారంటూ సిబ్బందిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana ts-news brs harish-rao harishrao jagadish-reddy residentialschool latest-news news-updates rspraveenkumar

Related Articles