Ahmedabad : అహ్మదాబాద్‌లో కూలిన విమానం.. ఫ్లైట్‌లో 242 ప్రయాణికులు !

అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


Published Jun 12, 2025 03:03:00 PM
postImages/2025-06-12/1749720865_jamestownplanecrashphoto.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. మేఘూని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చెట్టును ఢీకొట్టి విమానం కూలిపోయినట్లు తెలుస్తుంది. ప్రమాదం సమయంలో విమానం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం . అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లే క్రమంలో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.


ప్రమాదం జరిగిన వెంటనే ఏడు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. గాయపడిన వారిని రెస్క్యూ టీమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనాస్థలంలో ఎన్డీఆర్ ఎఫ్ సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. విమాన ప్రమాదం పై గుజరాత్ సీఎంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు. 


ప్రమాదానికి గురైన విమానం వైడ్‌బాడీ బోయింగ్‌ 787 డ్రీమ్‌ లైనర్‌. దీనిలో 300 మంది ప్రయాణించవచ్చు. మధ్యాహ్నం 1.39గంటల సమయంలో చెట్టును ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. సుదూర ప్రయాణం కావడంతో విమానంలో ఇంధనం కూడా భారీ ఉండడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu fire-accident airplane

Related Articles