రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అధికారులు జెనీవాలో చర్చలు జరిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు రోజుకి పెరిగిపోతుంది. సామాన్య , మధ్యతరగతి వారు కొనాలంటేనే భయపడుతున్నారు. తప్పక కొనేవాళ్లు కొంతమంది ఉన్నారు.కాని కొంతమంది బంగారాన్ని పెట్టుబడి కోసమే కొనేవారు ఉంటారు. అలాంటి వారికి మాత్రం ఇదో సువర్ణ అవకాశమనే చెప్పాలి . ఎందుకంటే ఫ్యూఛర్ లో బంగారం 10 గ్రాములు మూడు లక్షలు అయ్యే అవకాశం ఉందంటున్నారు .
అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం బంగారం ధరలను ప్రభావితం చేస్తుంది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అధికారులు జెనీవాలో చర్చలు జరిపారు. ఈ చర్చలు జరిపడం కోసం టారిఫ్ యుధ్ధానికి 90 రోజులు విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇది అఫిషియల్ అనౌన్స్ మెంట్ కాదు . అమెరికా కాని చైనా మీద వాణిజ్యపరమైన ఒత్తిడి పెంచితే గోల్డ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను అమలు చేయడం కొనసాగించవచ్చునని మంగళవారం ఫెడరల్ అప్పీళ్ల కోర్టు తీర్పు ఇచ్చింది. ట్రంప్ వేసిన టారిఫ్ లు రద్దుచేయకపోతే జులై ప్రారంభం నాటికి బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. సో మీ దగ్గర కాని డబ్బులు ఉంటే బంగారం పై పెట్టుబడి పెట్టుకొండి అంటున్నారు వ్యాపారస్థులు. చైనా కూడా బంగారం పై పెట్టుబడులు పెంచుతుంది. ప్రపంచంలోని అతిపెద్ద కేంద్ర బ్యాంకులలో ఒకటి బంగారం నిల్వలను పెంచుకుంటుండటం రాబోయే కాలంలో బంగారం ధరల పెరుగుదలకు మరింత బలంచేకూర్చుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.