అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో పంజాబ్ కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమి చెందింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఓటమి గురవ్వడంతో ఆ జట్టు సహా యజమాని , ప్రముఖ నటి ప్రీతి జింటా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరితమైన తుది పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు చేతిలో పంజాబ్ కేవలం ఆరు పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఈ ఓటమితో ప్రీతి జింటా మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఈ విజయంతో ఆర్ సీబీ జట్టు 18 ఏళ్ల పాటు పడిన కష్టం అంతా ఎగిరిపోయింది. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆర్సీబీ ఆటగాళ్లు , అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతుండగా పంజాబ్ డగౌట్ లో విషాదఛాయలు అలముకున్నాయి. ఎరుపు , తెలుపు రంగుల పంజాబ్ జెర్సీలో ఉన్న ప్రీతి జింటా , తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె భావోద్వేగానికి గురైన దృశ్యాలు అభిమానులను సైతం కలచివేశాయి.
ఆల్ మోస్ట్ చేతుల వరకు వచ్చిన విజయం మిస్ అవ్వడంతో ప్రీతి జింటా ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి."#PreityZinta" హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లోకి వచ్చింది. తను టీం కోసం చాలా కష్టపడిందని ఎప్పటికైనా ట్రోఫీ గెలవాలని కోరుతున్నారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్తో సహా పలువురు ఆటగాళ్లు సైతం కన్నీళ్లు పెట్టుకోగా, ప్రీతి వారిని ఓదార్చారు.