ఆదివాసీల జీవనోపాధికి వ్యవసాయ భూములను కేటాయిస్తూ వాటికి పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పెద్దపులుల ఆవాసం కోసం అడవిలో ని ఆదివాసీల గ్రామాలను తరలించారు. అప్పట్లో భారీ ఎత్తున వ్యతిరేకత వచ్చినా ..ఇప్పుడు ఆపరేషన్ పెద్దపులి సక్సస్ అయ్యింది. తొమ్మిదేళ్ల క్రితం 2016లో ప్రారంభించిన ప్రాజెక్టు టైగర్ విజయవంతమైంది. ఇలా ఆదివాసీలను అడవి నుంచి బయటకు పంపించడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే తొలిసారి. అయితే ఇలా తరలించిన ఆదివాసీల జీవనోపాధికి వ్యవసాయ భూములను కేటాయిస్తూ వాటికి పట్టాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం అందించింది.
అడవి మధ్యలో జనసంచారం ఉండటంతో పులులు స్థిరపడటం లేదు. ఈ కారణంతోనే గ్రామాలను తరలించి, అక్కడ గడ్డిభూములను అటవీశాఖ అభివృద్ధి చేస్తోంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే..రెండు గ్రామాల ఆదివాసీలు స్వఛ్ఛందంగా పులుల కోసం వాటికి నివాసం ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఆ పెద్దపులుల స్థిర నివాసం కోసం మైసంపేటలో 50 హెక్టార్లు, రాంపూర్లో 20 హెక్టార్లలో గడ్డిభూములను అభివృద్ధి చేస్తున్నారు.
2017లో అప్పటి నిర్మల్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ కవ్వాల్ టైగర్ రిజర్వు కోర్ ఏరియా నుంచి మైసంపేటలోని 105, రాంపూర్లోని 37 ఇలా మొత్తం 142 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని అనుకుంది. ఇందుకు 112 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని డీనోటిఫై చేసింది. తర్వాత పునరావాసంలో భాగంగా ఇళ్లు నిర్మించడమే కాకుండా కమ్యూనిటీ హాల్, ఓవర్హెడ్ ట్యాంక్, రహదారులు, అంగన్వాడీ భవనం, తాగునీరు, విద్యుత్, డ్రైనేజి తదితర మౌలిక సదుపాయాలు కల్పించారు. అయితే ఈ జాతీయ పులుల సంరక్షణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పునరావాసం నిమిత్తం ఆదివాసీలకు రెండు ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి నష్టపరిహారం గా డబ్బులు..మరొకటి పునరావాసం కల్పించడం ఆ 48 మందికి రూ.15 లక్షల చొప్పున నగదు ఇచ్చారు.