Gandhi Bhavan : గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత.. మహిళా కాంగ్రెస్ నేతల అరెస్ట్

బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతలను గాంధీభవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.


Published Aug 07, 2024 01:52:33 PM
postImages/2024-08-07/1723018953_GandhiBhavan.jpg

న్యూస్ లైన్ డెస్క్ : హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఎరుపు రంగు దుస్తులు వేసుకొని బీజేపీ ప్రధాన కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో.. పోలీసులు మహిళా కాంగ్రెస్ నేతలను గాంధీభవన్ గేటు వద్దే అడ్డుకున్నారు. దీంతో మహిళా కాంగ్రెస్ నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.

దేశంలో మహిళలకు రక్షణ లేదని.. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ మహిళ కాంగ్రెస్ బీజేపీ ఆఫీసుల ముట్టడికి పిలుపునిచ్చింది. అధిక ధరల వద్ద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని మహిళలను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వారు బీజేపీ ఆఫీసుల ముందు నిరసనకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాంపల్లి గాంధీ భవన్, బీజీపీ ఆఫీసు పరిసరాల్లో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress rahul-gandhi congress-government nampally

Related Articles