carona: కోవిడ్ కొత్త వేరియంట్ తో భారత్ మరోసారి ఇబ్బందుల్లో పడనుందా !

ప్రయాణికుల ద్వారా ఈ వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశించినట్లు సీడీసీ అధికారికంగా ప్రకటించింది.


Published May 29, 2025 09:00:00 PM
postImages/2025-05-29/1748532686_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కోవిడ్ కొత్త వేరియంట్ తో ఇప్పటికే చైనాలో తీవ్రంగా విజృంభిస్తోంది. హాంగ్ కాంగ్ లో నెల రోజుల్లో 80 కి పైగా కేసులు నమోదయ్యాయి. అక్కడి ఆరోగ్యవ్యవస్థను మళ్లీ ఒత్తిడి లోకి నెట్టేసింది. ఇటు ట్రావెలింగ్ హిస్టరీ ఉన్నవారిని అమెరికా వైద్యపరీక్షలు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రయాణికుల ద్వారా ఈ వేరియంట్ తమ దేశంలోకి ప్రవేశించినట్లు సీడీసీ అధికారికంగా ప్రకటించింది.


వేరియంట్ సెకండ్ వేవ్ కు దగ్గరగా ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. చాలా వేగంగా వ్యాపించగల శక్తి ఉందంటున్నారు. మరణానికి దారి తీయదు అంటున్నా..మరణాలు కూడా సంభవిస్తున్నాయని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పటికే ..ఇప్పుడు జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, థాయిలాండ్, వియత్నాం, స్పెయిన్, నెదర్లాండ్స్‌ లాంటి దేశాల ద్వారా ప్రయాణిస్తున్నవారిలో కనిపించడం చూస్తే.. దీని వ్యాప్తి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 


NB181 అనే ఈ కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ ఫ్యామిలీకే చెందిందే . ఇది సాధారణ లక్షణాలతో మొదలవుతుంది. మొదట్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటి తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి కానీ.. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఇది తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తోంది. ఫుల్‌ స్పీడ్‌తో శరీరంలో పాకే లక్షణం దీని ప్రత్యేకత. దీన్ని ఓ 'గ్రోత్ అడ్వాంటేజ్‌' కలిగిన వేరియంట్‌గా గుర్తించారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu covid-time

Related Articles