మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య మళ్లీ భారీగా పెరుగుతుంది. ఆదివారం ఒక్క రోజులో దేశవ్యాప్తంగా 363 కొత్త కోవిడ్ కేసులు నమోదయినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సోమవారం తెలిపింది. భారత్ లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,961 కి చేరుకుంది. కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు మొదలవుతున్నాయి. మరోసారి లాక్ డౌన్ తప్పదా అనే సందేహాలు అందరిలోనూ తలెత్తుతున్నాయి.
ఒక్కరోజులోనే పశ్చిమ బెంగాల్లో 82 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇది అన్ని రాష్ట్రాల్లో కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ. ఆ తర్వాత కేరళలో 64కేసులు, ఢిల్లీలో 61 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం కేరళలో 1400 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 485కేసులు, ఢిల్లీలో 436, గుజరాత్ లో 320 పశ్చిమ బెంగాల్లో 287కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
4 గంటల్లో కర్ణాటక , కేరళలో ఒక్కొక్కరు కోవిడ్ తో మరణించారు. దేశవ్యాప్తంగా అదే సమయంలో 383 మంది రోగులు కోలుకుని డిశార్చీ అయ్యారు. జనవరి 1,2025 నుంచి ఇప్పటి వరకు దేశంలో 28 మంది కోవిడ్ తో మరణించారు. అందులో కేరళ , మహారాష్ట్రలో ఏడుగురు కర్ణాటక లో నలుగురు , ఢిల్లీలో ముగ్గురు మరణించారు. మే 29న బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 63ఏళ్ల వృద్ధుడు కోవిడ్ తో మరణించాడు.