Rakul:రకుల్ తిండిబోతా..నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేయలేదని బ్రేకప్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించిన హీరోయిన్లలో  రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు..  మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె 2009వ సెల్వా రాఘవన్ యొక్క సెవెన్ జీ రెయిన్ బో


Published Sep 13, 2024 11:34:55 AM
postImages/2024-09-13/1726207495_rakul.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించిన హీరోయిన్లలో  రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు..  మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె 2009వ సెల్వా రాఘవన్ యొక్క సెవెన్ జీ రెయిన్ బో కాలనీకి రీమేక్ అయినటువంటి కన్నడ చిత్రం ఢిల్లీలో నటించింది. ఈ విధంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె  ఆ తర్వాత తెలుగులో సిద్ధార్థ రాజ్ కుమార్ సరసన తెలుగులో "కెరటం" మూవీలో నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఈ విధంగా ఒక్కో సినిమా చేసుకుంటూ మంచి గుర్తింపు సాధించింది రకుల్ ప్రీత్ సింగ్. అలాంటి ఈ ముద్దుగుమ్మ  తాజాగా ఒక ఇంటర్వ్యూలో  తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ గురించి తెలియజేసింది. గతంలో ఆమె ఒక పర్సన్ తో రిలేషన్ లో ఉన్నానని   ఆయనకు ఫుడ్ విషయంలో వచ్చిన గొడవ వల్ల బ్రేకప్ చెప్పానని చెప్పింది. అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆహారం అంటే ఎక్కువగా ఇష్టపడుతుందట. ఎక్కడ ఆహారమున్న నాకు నచ్చినట్టు ఆరగిస్తానని, శాఖాహారమైతే ఎక్కువగా తింటానని చెప్పుకొచ్చింది.

ఫుడ్ విషయంలో ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, నాకు నచ్చదని, ఒకరోజు నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి నేను  రెస్టారెంట్ కి వెళ్లానని అక్కడ ఆహారం గురించి ఆయన తక్కువ చేసి మాట్లాడడం నాకు అసలు నచ్చలేదని, అంతేకాకుండా  మళ్లీ వేయించిన ఫుడ్ ఆర్డర్ చేశాడని తెలియజేసింది. కానీ ఈ ఫుడ్ రకుల్ ప్రీత్ సింగ్ కు నచ్చలేదని, నేను తినే ఆహారం విషయంలో ఆయన తక్కువ చేసి మాట్లాడడని నాకు ఇష్టమైన భోజనం విషయంలోనే అలా చేస్తే నాతో జీవితకాలం ఉంటాడు నా ఇష్టా ఇష్టాలు ఎలా షేర్ చేసుకుంటారని నాకు అనిపించి బ్రేకప్ చెప్పాలని తెలియజేసింది. ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ చెప్పడంతో ఈమె తిండిబోతు అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kollywood rakul-preet-singh siddarth-rajkumar keratam selva-raghavan 7g-rain-bow-coloney

Related Articles