న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అమరావతి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లోని జర్నలిస్ట్ కాలనీ లో ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు. అంతేకాదు కొమ్మినేని ఏపీకి తరలిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిపై సాక్షి టీవీ చర్చలో మహిళలను అవమానించి మాట్లాడరనే ఫిర్యాదులు పోలీసులకు చేరడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
దీనిపై ఏపీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కొమ్మినేనితోపాటు జర్నలిస్ట్ కృష్ణంరాజు, ఛానల్ యాజమాన్యంపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.