Hyderabad: స్టేషన్‌లో కాంగ్రెస్ నేత బర్త్ డే.. ఎస్సైపై వేటు

కేక్ కట్ చేయించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో..  స్టేషన్‌లో ఓ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు ఎస్సై లక్ష్మణ్ జరిపారన్న విషయం బయటపడింది.

 


Published Sep 09, 2024 11:59:46 AM
postImages/2024-09-09/1725863386_sitransfer.jpg

న్యూస్ లైన్ డెస్క్: పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేత పుట్టినరోజు జరిపిన ఎస్సైపై వేటు పడింది. వట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ జ్యోషి పుట్టిన రోజు వేడుకలను ఎస్సై లక్ష్మణ్, స్టేషన్ సిబ్బంది జరిపారు. కేక్ కట్ చేయించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో..  స్టేషన్‌లో ఓ పార్టీ నేత పుట్టిన రోజు వేడుకలు ఎస్సై లక్ష్మణ్ జరిపారన్న విషయం బయటపడింది.

స్టేషన్‌లో పుట్టిన రోజు వేడుకలు జరపడంపై ఉన్నతాధికారుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎస్సైపై హైదారాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ చర్యలు తీసుకున్నారు. స్టేషన్‌లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఎస్సై లక్ష్మణ్‌ను బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో సిబ్బంది పాత్రపై విచారణ జరపాలని ఆయన అధికారులకు సూచించారు.

 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu congress telanganam hyderabad-police

Related Articles