వీటికి కారణాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేవు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : సముద్రతీరం లో చాలా మార్పులు జరుగుతున్నాయి. అందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో సముద్రజంతువులు చనిపోతూ తీరానికి తేలిపోవడం సైంటిస్టులకే ఆశ్చర్యం కలిగిస్తుంది. టాస్మానియాలో ఒక్కసారిగా 150 పైగా ఫాల్స్ కిల్లర్ వీల్స్ చనిపోయి ఒడ్డుకు చేరుకొన్నాయి.. వీటికి కారణాలు ఇంకా పూర్తిగా స్పష్టంగా లేవు. కానీ శాస్త్రవేత్తలు కొన్ని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టారు.
* వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. సునామీలు , భూకంపాలు వస్తాయనే అనుమానాలు.
* సముద్రపు ఉష్ణోగ్రతలు పెరగడం , ప్రవాహ మార్పులు , జీవనివాసాల విధ్వంసం వల్ల తిమింగలాలు దారి తప్పి తీరానికి వచ్చేస్తున్నాయి.
* సముద్రపు లోతుల్లో భూకంపాలు వచ్చి ఉండవచ్చు. లేదా మరొక కారణం..శబ్ద కాలుష్యం. సముద్రంలో నావికాదళాలు ఉపయోగించే సోనార్ లాంటి శబ్ద తరంగాలు తిమింగలాల నావిగేషన్ను గందరగోళానికి గురిచేస్తున్నాయన్న అనుమానం కూడా ఉంది.
* నిజానికి తిమింగళాలు చీకటి లీతుల్లో స్వఛ్ఛమైన శబ్దాలను ఆధారంగా చేసుకునే జీవులకు అర్ధం కాని మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇదే టైంలో అసలు ఒడ్డుతో సంబంధం లేకుండా తీరానికే రాని ఓర్ఫిష్ లాంటి చేపలు కూడా కనిపించడమే మనుషులకు భయాందోళనలు పెంచుతున్నాయి.