life style: ఏప్రిల్ 1 నాటికి మేజర్ అవుతుంటే..ఈ పనులు చెయ్యాల్సిందే !

ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం . కాబట్టి మీ హక్కును ముందు సెక్యూర్ చేసుకొండి.


Published Mar 21, 2025 12:35:00 PM
postImages/2025-03-21/1742540852_voterukhand.jpg


న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఎన్నికలు వస్తేనే కాని మేజర్ల గురించి ఎవరు పట్టించుకోరు అది మన అతి పెద్ద ప్రజాస్వామ్య భారత్ . కాని మేజర్ అవ్వగానే ...మనకు మనమే చెయ్యాల్సిన కొన్ని పనులు ఉన్నాయి.ఓటు హక్కు అనేది సామాన్యుని చేతిలో ఉన్న వజ్రాయుధం . కాబట్టి మీ హక్కును ముందు సెక్యూర్ చేసుకొండి.


ఏప్రిల్​ ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి  నూతనంగా ఓటరు నమోదుకు గతంలో ఎలక్షన్​ కమిషన్ జనవరి ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారిని మాత్రమే అవకాశం కల్పించేది. కాని ఇప్పుడు ప్రతి ఏటా 4 సార్లు జనవరి , ఏప్రిల్ , జూలై , అక్టోబర్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసుకునే సౌలభ్యం కల్పించింది. ఈ ఏప్రిల్ ఒకటో తేదీకి 18 ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు నమోదుకు అర్హులు.


* 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు voters.eci.gov.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


* ఫారం -6: 18 ఏళ్లు నిండిన వారు కొత్త గా ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చు.


* ఫారం-7 : స్థానికంగా లేని ఓటర్ల పేర్లను తొలగించేందుకు ఈ ఫారంని ఉపయోగిస్తారు. వలస వెళ్లిన వారు (మైగ్రేటెడ్​), రెండు చోట్ల పేరున్న వారు, చనిపోయిన వారి పేర్లను తొలగించుకోవచ్చు.


* అంతేకాదు ఓటర్ ఐడీ లో మీ పేరు , తేదీ , అడ్రస్ వంటివి సవరించుకోవచ్చు . ఒక పోలింగ్ సెంటర్ నుంచి మరో కేంద్రానికి ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చు.


* ఆఫ్​లైన్​లో స్థానిక బీఎల్​వో, తహసీల్దార్​ కార్యాలయాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu election-code telangana

Related Articles