Bala Krishna: తెలుగు రాష్టాలకు బాలయ్య భారీ విరాళం

బాలయ్య తన వంతుగా రూ. కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.


Published Sep 03, 2024 06:49:29 AM
postImages/2024-09-03/1725362066_balakrishna.PNG

న్యూస్ లైన్ డెస్క్: బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులుగా అతి భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముందుకొచ్చారు. బాలయ్య తన వంతుగా రూ. కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక రూ.50 లక్షల చొప్పున విరాళం అందించారు.

ఇప్పటీకే తెలుగు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ (చినబాబు), ఎస్.నాగవంశీ కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. అలాగే  ఎన్టీఆర్ రూ. కోటి రూపాయల విరాళం, సిద్దు జొన్నలగడ్డ 30 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వరద బాధిత ప్రాంతాలలోని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. నష్టం భారీగానే జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు. 

 

newsline-whatsapp-channel
Tags : telangana balakrishna tollywood csrfunds floods-in-telangana

Related Articles