ఈ విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రపూట గుర్రాలు , గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఉత్తరాఖాండ్ వెళ్లే యాత్రికులు కేదార్ నాథ్ వెళ్లినప్పుడు అక్కడ నడవలేని వారు చాలా మంది గుర్రాలు, గాడిదల మీద వెళ్తుంటారు. అయితే స్థానిక వ్యాపారులకు ఇదో ఆదాయవనరు . ఆరు నెలల పాటు ఇదే వారికి జీవన వృత్తి. డబ్బుల కోసం కనీసం ఆ మూగజీవాలకు రెస్ట్ కూడా ఇవ్వకుండా రాత్రి , పగలు వాటితో పనులు చేయిస్తుంటారు. జనాలను సంచులను మోయిస్తూ ఉంటారు. మూగజీవాల హింస మీద ఉత్తరాఖండ్ హైకోర్టులో ఓ పిటిషన్ నమోదైంది.
అయితే ఈ విచారణ జరిపిన హైకోర్టు కేదార్ నాథ్ మార్గంలో రాత్రపూట గుర్రాలు , గాడిదల మీద ప్రయాణాన్ని నిషేధించింది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం వరకు ఇక నుంచి వాటిని వినియోగించకూడదు. హైకోర్టు ఆదేశాలతో చార్ ధామ్ బోర్డు, స్థానిక జిల్లా అధికారులు ఆ మేరకు అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని టూర్ ఆపరేటర్లు స్థానిక గుర్రాలు గాడిదల యజమానులకు వార్నింగ్ ఇచ్చారు.
ఎక్కువ మంది ఈ గుర్రాలు, గాడిదల మీదే వెళ్తుంటారు. అలాగే, అక్కడికి తీసుకుని వెళ్లే సామగ్రిని కూడా వాటి మీదే తరలిస్తూ ఉంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 న చార్ థామ్ యాత్ర ప్రారంభమైన మొదటిరెండు , మూడు వారాల్లోనే 20 కి పైగా గుర్రాలు , గాడిదలు చనిపోయాయి. దీంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కేవలం 16 మాత్రమే చనిపోయాయని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీంతో వెంటనే చార్ ధామ్ యాత్రలో గుర్రాలు, గాడిదల వినియోగంపై ఒక్కరోజు సస్పెన్షన్ విధించారు.