Breaking News : ఆలయంలో చోరీ.. పవన్ కల్యాణ్ పై కేసు, అరెస్ట్

పవన్ కల్యాన్ అనే దొంగల ముఠా రాత్రిళ్లు ఆలయాల్లో నిద్రిస్తూ దేవతల విగ్రహాలను దొంగిస్తోందని వెల్లడించారు.


Published Aug 18, 2024 07:04:38 PM
postImages/2024-08-18/1723988078_TheftInTemple.jpg

న్యూస్ లైన్ డెస్క్ : జిల్లాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాతో బాపట్ల జిల్లా రేపల్లెలో కొంతకాలంగా స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. రంగంలోకి దిగిన పోలీసులు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. పవన్ కల్యాన్ అనే దొంగల ముఠా రాత్రిళ్లు ఆలయాల్లో నిద్రిస్తూ దేవతల విగ్రహాలను దొంగిస్తోందని వెల్లడించారు.

రాజోలుకు చెందిన పవన్ కల్యాణ్.. తెనాలికి చెందిన విజయ్ కుమార్, సాయిలతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. గత మూడు నెలలుగా రేపల్లె డివిజన్ లో ఉన్న ఆలయాలను టార్గెట్ చేశారు. గుడిలో ఉన్న వెండి, పంచలోహ విగ్రహాలపై కన్నేసి.. రాత్రి ఆలస్యమయింది. గుడిలో పడుకొని తెల్లవారాక వెళ్లిపోతామని నమ్మించినట్టు చేస్తారు. తెల్లవారేలోపు గుడిలో ఉన్న విలువైన వస్తువులు, విగ్రహాలు, ఆభరణాలు ఉడాయించుకొని పారిపోతారు. వీరి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా పవన్ కల్యాణ్ గ్యాంగును పట్టుకున్నారు. వారి  నుంచి భారీగా విలువైన ఆలయ సామాగ్రి, ఆభరణాలు, దేవతా మూర్తుల విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : ap-news andhrapradesh police crime- crime

Related Articles