KARANATAKA: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు బంద్ !


నిన్న బెంగుళూరు ..జయానగర్ లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో , ఉబర్ , ఓలా సంస్థలు తమ సేవలను సోమవారం ఉదయం నుంచి నిలిపివేశాయి.తమ యాప్​ల నుంచి బైక్ ట్యాక్సీ సర్వీస్ ఆప్షన్లను తొలగించాయి. ర్యాపిడో బైక్ డ్రైవర్ కస్టమర్ ను చెంప దెబ్బ కొట్టడం వైరల్ గా మారింది.


Published Jun 17, 2025 12:19:00 PM
postImages/2025-06-17/1750143017_1UskMJvCJeT9dxA8OnuJ.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. బైక్ టాక్సీ సేవలను అందించడానికి మార్గదర్శకాలు అమలు అయ్యే వరకు వాటి సేవలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాన్ని కర్ణాటక హైకోర్టు సమర్ధించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక లో బైక్ టాక్సీల నిషేధం సోమవారం నుంది అమలైంది. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ర్యాపిడో , ఉబర్ , ఓలా సంస్థలు తమ సేవలను సోమవారం ఉదయం నుంచి నిలిపివేశాయి.తమ యాప్​ల నుంచి బైక్ ట్యాక్సీ సర్వీస్ ఆప్షన్లను తొలగించాయి. 


హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో తెలిపింది. నిన్న బెంగుళూరు ..జయానగర్ లో ర్యాపిడో బైక్ డ్రైవర్ కస్టమర్ ను చెంప దెబ్బ కొట్టడం వైరల్ గా మారింది. మొదటి నుంచి బైక్ టాక్సీ సర్వీసులను ఆటో, టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్ తర్వాత ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని వాపోతున్నారు. అంతలోనే రాష్ట్ర ప్రభుత్వం శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించడం వల్ల తాము ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
మరో వైపు , బ్యాక్ ట్యాక్సీ డ్రైవర్లు లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే బైక్ ట్యాక్సీ డ్రైవర్లకు లైసెన్స్ లు, శిక్షణ , బీమా కోసం స్పష్టమైన నియమాలను రూపొందించడానికి బదులుగా వాటిని నిషేధించాలనే నిర్ణయం సముచితం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వేలాది మంది ఆర్థిక ఇబ్బందుల్లో పడతారని డ్రైవర్లు వాదిస్తున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karnataka- ola-bike

Related Articles