Lashkar-e-Taiba: జమ్ముకాశ్మీర్ లో ఇద్దరు లష్కరే తోయిబా తీవ్రవాదులు లొంగుబాటు !

పహల్గామ్ ఘటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు , పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ నిషేధిత లష్కరే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాల దగ్గర లొంగిపోయారు. 

 


Published May 29, 2025 05:36:49 AM
postImages/2025-05-29/1748506667_Terrorists17484927488901024x576.webp

న్యూస్  లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గామ్ ఘటన నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లో భద్రతా బలగాలు , పోలీసులు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ నిషేధిత లష్కరే తోయిబా ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఇద్ద‌రు టెర్ర‌రిస్టులు బస్కుచాన్ ప్రాంతంలో భద్రతా దళాల దగ్గర లొంగిపోయారు. 


"క‌శ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లా బస్కుచాన్ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు సంయుక్తంగా ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. అక్కడే తోటల్లో ఇద్దరు టెర్రరిస్ట్ లు ఉన్నట్లు సమాచారం అందుకున్నారు అధికారులు. ఈ క్ర‌మంలో లష్కరే తోయిబాకు చెందిన‌ ఇర్ఫాన్‌ బషీర్‌, ఉజైర్‌ సలామ్‌ లొంగిపోయారు. వారి నుంచి రెండు ఏకే 56 రైఫిళ్లు, 4 మ్యాగజైన్లు, 2 హ్యాండ్‌ గ్రనేడ్లు, ఇత‌ర మందుగుండు సామాగ్రితో పాటు కొంత న‌గ‌దు  స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పెహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇప్పటివరకు 26 మంది ఉగ్రవాదులను అంతమొందించారు. ఈ నెల ప్రారంభంలో షోపియాన్‌, పుల్వామాలోని త్రాల్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఆరుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన విషయం తెలిసిందే. 

 

newsline-whatsapp-channel
Tags : jammu-kashmir indian-army terrarist

Related Articles