SHIMBU: తెలుగు రాష్ట్రాలకు విరాళమిచ్చిన ఏకైక తమిళ్ హీరో ..శింబు మాత్రమే!

తెలుగు రాష్ట్రాలకు వరదలు వస్తే ఏ ఇతర ఇండస్ట్రీ లు పట్టించుకోలేదు. జస్ట్ ఒకే ఒక్క హీరో శింబు మాత్రమే తెలుగు రాష్ట్రాలకు కూడా విరాళాలు ఇచ్చారు. 


Published Sep 10, 2024 11:57:00 AM
postImages/2024-09-10/1725949716_dcCoverc6bambqq1nl9cr88ijpt6kq3g620190928011340.Medi.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ , తెలంగాణలో వరదల భీభత్సం సృష్టిస్తున్నాయి. విజయవాడ ప్రజలు వర్షాలతో అల్లాడిపోతున్నారు. వయనాడ్ కూడా వరదలతో సర్వం నాశనమయ్యింది. తెలుగు హీరోలంతా కలిసి వయనాడ్ కు విరాళాలిచ్చారు. తోచిన సాయం చేశారు. కాని తెలుగు రాష్ట్రాలకు వరదలు వస్తే ఏ ఇతర ఇండస్ట్రీ లు పట్టించుకోలేదు. జస్ట్ ఒకే ఒక్క హీరో శింబు మాత్రమే తెలుగు రాష్ట్రాలకు కూడా విరాళాలు ఇచ్చారు. 


మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వసూళ్లు రాబట్టుకుని, జేబులు నింపేసుకునే ఇతర ఇండస్ట్రీ సెలెబ్రిటీలు మాత్రం విరాళం కాదు కదా.. కనీసం స్పందించనూ కూడా లేదు. తమిళ్ లో దాదాపు అందరు హీరోలకు తెలుగులో అంతో ఇంతో మార్కెట్ ఉంది. వసూళ్లకు తెలుగు జనాలు కావాలి కాని కష్టాల్లో మాత్రం ఎవ్వరికి గుర్తుకు రాము.


కానీ తాజాగా శింబు తన మంచి మనసు చాటుకున్నాడు. తెలుగు హీరోలు కాకుండా.. ఇలా విరాళం ఇచ్చిన మొదటి తమిళ హీరోగా నిలిచాడు. శింబు ఎంత ఇచ్చాడన్నది తర్వాత విషయం కాని తెలుగు వాళ్లు ఇబ్బంది పడుతున్నారు వారికి సాయం చెయ్యలనే ఆలోచన వచ్చింది. నిజానికి శింబు కి తెలుగు లో పెద్దగా మార్కెటే లేదు. మన్మధ సినిమా తర్వాత తెలుగు లో పెద్ద గా సినిమాలు చెయ్యలేదు. అయినా  తన వంతు సాయం చేశాడు. కోట్లు కొల్లగొట్టుకుపోయే సో కాల్డ్ ఫేమస్ హీరోలు మాత్రం అసలు రెస్పాండ్ అవ్వలేదు. దీని గురించి ఎవ్వరిని ఏం అనకూడదు. తెలుగు వాళ్లకే బుధ్ధి లేదు..అబ్బా ఆ హీరో నా ఫేవరెట్ ..ఈ హీరో నా ఫేవరేట్ అంటారు గా ..మీకు కావాల్సిందే .
 

newsline-whatsapp-channel
Tags : tamilanadu floods

Related Articles