భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. సింధూ జలాల ఒప్పందం విరమించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పహల్గామ్ నరమేధం పై భారత ఆర్మీ ప్రతీక చర్యలు మొదలుపెట్టింది. ఈ పాశవిక ఉగ్రదాడిలో పాత్ర ఉన్న టెర్రరిస్ట్ ఆదిల్ షేక్ ఇంటిని సైన్యం ఐఈడీ తో పేల్చేసింది. బిజ్ బెహరా , త్రాల్ ప్రాంతంల్లోనూ బలగాల కూంబింగ్ కొనసాగుతుంది. లోకల్ ఉగ్రవాదుల నివాసంపై దాడు చేస్తుంది భారత్ ఆర్మీ. మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ పాశవిక చర్యలో దాయాది పాకిస్థాన్ హస్తం ఉందని ఆరోపిస్తూ భారత్ కఠిన ఆంక్షలకు దిగింది. సింధూ జలాల ఒప్పందం విరమించుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.