RTC bus: ఆర్టీసీ బస్సులో వృద్ధురాలు మృతి

అక్కడ నుంచి తొర్రూరుకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణించింది. తొర్రూరు వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూసింది. సీటులో అడ్డం పడిపోవడంతో తోటి ప్రయాణికులు గమనించి 108కు ఫొన్ చేసి సమాచారం ఇచ్చారు. 


Published Aug 08, 2024 12:41:04 PM
postImages/2024-08-08/1723101064_rtc.jpg

న్యూస్ లైన్, తొర్రూరు: మహబాబూబాద్ జిల్లా తొర్రూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ వృద్దురాలు కన్నుమూసింది. పెరికేడుకు చెందిన మావిండ్ల గౌరమ్మ(70) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో పెద్దాస్పత్రిలో చూపించుకునేందుకు ఉదయం పెరికేడు నుంచి రాయపర్తి వరకు ఆటోలో వచ్చింది. అక్కడ నుంచి తొర్రూరుకు ఆర్టీసీ బస్సు ఎక్కి ప్రయాణించింది. తొర్రూరు వచ్చే క్రమంలో బస్సులోనే కన్నుమూసింది. సీటులో అడ్డం పడిపోవడంతో తోటి ప్రయాణికులు గమనించి 108కు ఫొన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న 108 సిబ్బంది వృద్ధురాలిని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే, అప్పటికే ఆవిడ చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు.

గౌరమ్మకు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఇలా జరిగిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లికి సరైన వైద్యం అందించి ఉంటే ఈ రోజు బస్సులో ప్రాణాలు పోవాల్సిన  పరిస్థితి వచ్చేది కాదంటునారు.
 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam free-bus tgsrtc

Related Articles