Samantha:బ్రేకప్ నుంచి కోలుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేసిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన న్యూ జర్నీ గురించి అభిమానులతో షేర్ చేసింది. వరల్డ్‌ పికిల్‌బాల్‌ లీగ్‌లో భాగంగా చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు సమంత మంగళవారం ముంబైలో జరిగిన


Published Aug 21, 2024 08:32:51 AM
postImages/2024-08-21/1724209371_samantha.jpg

న్యూస్ లైన్ డెస్క్:టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన న్యూ జర్నీ గురించి అభిమానులతో షేర్ చేసింది. వరల్డ్‌ పికిల్‌బాల్‌ లీగ్‌లో భాగంగా చెన్నై ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు సమంత మంగళవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో వెల్లడించింది. చెన్నై జట్టు కు యజమానిగా ఉండటం తనకెంతో ఆనందంగా ఉన్నదని  తెలియజేసింది.  ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్‌తో పంచుకుంది. 'న్యూ బిగినింగ్‌' అంటూ ఆ పోస్ట్‌కు ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జోడించింది. ఇది చూసి నెటిజన్లు తనకు 'ఆల్ ది బెస్ట్' చెప్తున్నారు. కొత్త జర్నీ సక్సెస్‌ఫుల్‌ కావాలంటూ కామెంట్లు పెడుతున్నారు. టెన్నిస్‌, టేబుల్‌ టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ను లాగే ఉంటుంది.

అయితే, దీనికి కొన్ని స్పెషల్ రూల్స్‌ ఉన్నాయి. 1965లో అమెరికాలో ప్రారంభమైన ఈ ఆటకు, ఇప్పుడు మన భారతదేశంలో కూడా విశేష స్పందన లభిస్తున్నది.  ఇండోర్‌, అవుట్‌డోర్‌లో ఈ గేమ్‌ను బాగా ఆడుతారు. సాధారణంగా సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతుంటారు. ప్రస్తుతం సమంత పెట్టినటువంటి ఈ పోస్ట్‌ వల్ల  అభిమానులకు మరింత ఆసక్తి  పెరిగింది.

అయితే సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆయనను పూర్తిగా మర్చిపోవడం కోసం  సినిమాల్లో బిజీ అయిపోయింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి  విదేశాల్లో చికిత్స తీసుకొని కోలుకుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను పెళ్లి చేసుకోబోతున్నాడని తెలిసి, ఇక తాను కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దామనుకుంటుంది. అందుకే మొదటిసారి స్పోర్ట్స్ కు సంబంధించిన  వరల్డ్ పికిల్ బాల్ లీగ్ యజమానిగా ఎంపికైంది. ఈ విధంగా నాగచైతన్యను పూర్తిగా మర్చిపోవడం కోసమే ఈమె ఇలా చేస్తుందని, ఇక తను కొత్త లైఫ్ లో అడుగు పెట్టబోతోందని  అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna samantha nagachaitanya sobhita-dhulipala pickel-ball

Related Articles