IAS: విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్

తెలంగాణ విద్యా కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


Published Sep 07, 2024 02:54:11 PM
postImages/2024-09-07/1725701051_ankuri.PNG

న్యూస్ లైన్ డెస్క్: తెలంగాణ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు విద్యా రంగంపై సమగ్రమైన విద్యా పాలసీని తయారు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఇక తెలంగాణ విద్యా కమిషన్‌ చైర్మెన్‌గా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, చైర్మన్‌తో పాటు విద్యా రంగంలో నిపుణులైన ముగ్గురు సభ్యులతో కమిషన్‌ను ఏర్పాటు చేశారు. విద్యా శాఖ ఉన్నతాధికారి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy congress-government government-schools ias-officer education

Related Articles