Srinivas Goud: పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదు 

బీఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని బీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-12/1720791225_srinivas2.jfif

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ పార్టీని లేకుండా చేయడం ఎవరి తరం కాదని బీఆర్‌ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. పార్టీ మారుతున్న వారు బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్‌కు, కేసీఆర్‌కు జై కొట్టిన వారు ఇపుడు పార్టీఏ ఉండదన్నట్టు మాట్లాడుతున్నారని, అది ప్రజలు నిర్ణయించాలి తప్ప కొందరు ఎమ్మెల్యేలో, నాయకులో కాదన్నారు. రెండు ఎంపీ సీట్లు ఉన్న బీజేపీ ఇపుడు ఏ స్థాయికి చేరుకుంది? కాంగ్రెస్‌కు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు లేకపోయినా అధికారంలోకి రాలేదా అని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి గొప్ప ఉద్యమ చరిత్ర ఉందని, త్యాగాల పునాదుల మీద బీఆర్ఎస్ పుట్టిందన్నారు. సమయం వచ్చినపుడు తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్‌దని, పార్టీ మారే వారు తొందరపడుతున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కే కాదు ఇంకా పద్నాలుగు పార్టీలకు సీట్లు రాలేదని, మోడీ కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీద పార్లమెంటు ఎన్నికలు జరిగాయి అన్నారు.

రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారు ఈ విషయాలు గమనిస్తారని, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఫలితాలు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లా ఉండవున్నారు. ప్రజలు తెలివైన వారు వచ్చే ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకుంటారని, బీఆర్ఎస్‌కు 65 లక్షల మంది సభ్యత్వం ఉంది ఆషామాషీగా తుడిచి పెట్టలేరని హెచ్చరించారు. బీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలే కాపాడుకుంటారని, తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడుకోవాలంటే బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ దేశంలో అభివృద్ధికి రోల్ మోడల్ అయ్యింది. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చక పోతే కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెబుతారన్నారు. ఎమ్మెల్యేలు ఇష్టం లేకుంటే పోండి కానీ తల్లి లాంటి పార్టీని విమర్శించకండి, పార్టీ ఉండదు అని శాపనార్ధాలు పెట్టడం మంచిది కాదన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఒడిదొడుకులు కొత్త కాదు, ఒక్కసారి ఓడిపోగానే పార్టీల పని అయిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను ఉద్యమంలో కూడా చంపాలని చాలా మంది ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌ను లేకుండా చేయాలనే కుట్రలు సఫలం కావు, ఓడిపోయినంత మాత్రాన ఎదో జరుగుతుందని ఊహించుకోవడం సరికాదని తెలిపారు. బీఆర్‌ఎస్‌కు 33 జిల్లాల్లో, ఢిల్లీలో ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి, బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణ వచ్చేదా అని గుర్తు చేశారు. ఈ పార్టీ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? కేసీఆర్ ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చేవారా? తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ ఉందని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రజలారా ఈ పార్టీని మీరే రక్షించుకోవాలని, దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా పెట్టండని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఏ పార్టీ అంతాన్ని కోరుకోలేదని, ప్రజలను మెప్పించేలా కాంగ్రెస్ నేతలు పాలన చేయాలి కానీ ఫిరాయింపుల మీద దృష్టి పెట్టారన్నారు. తమకు రాజకీయాల కన్నా తెలంగాణ అభివృద్ధి అస్తిత్వం ముఖ్యం అని తెలిపారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మళ్ళీ అధికారంలోకి వస్తామనే విశ్వాసం ఉందన్నారు. తప్పులుంటే సరిదిద్దుకుంటాం మేము దేవుళ్ళం కాదు అన్నీ కరెక్ట్ చేశామని చెప్పడం లేదన్నారు. అనేకసార్లు అనేక మెట్లు దిగాం భవిష్యత్‌లో మా లోపాలు సవరించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ సబ్బండ వర్గాల పార్టీ, పార్టీ మారుతున్న వారు తమ సొంత బలం మీద గెలిచాం అనుకుంటే రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు. ఉద్యమ పార్టీపై నిందలు వేయడం సరికాదని, కేసీఆర్ తెలంగాణకు మంచి చేయడమే కాంగ్రెస్ నాయకులకు తప్పుగా కనిపిస్తోందా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో కోర్టులు చట్టాలు లేవా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 

newsline-whatsapp-channel
Tags : telangana brs congress cm-revanth-reddy srinivasan

Related Articles