KTR: మెగా డీఎస్సీ‌పై ఇచ్చిన మాట ఏమైంది రేవంత్? 

తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720521213_ktrgm1.PNG

న్యూస్ లైన్ డెస్క్: తొలి క్యాబినెట్ లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. తొమ్మిది నెలలు కావస్తున్నా లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన కాంగ్రెస్ సర్కారుకు వినపడటంలేదని ఆయన మండిపడ్డారు. మీరు కొలువుదీరితే సరిపోతుందా? యువతకు కొలువులు అక్కర్లేదా అని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు. తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారని, డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారన్నారు. వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారని, కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారని విమర్శించారు. 

గుర్తుపెట్టుకోండి ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధం మళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారని, నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా? ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా అని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌కు మోకా వస్తే డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా? ఇప్పటికే మెగా డీఎస్సీ అని నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారన్నారు. ఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం, పరీక్షలు వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి అన్నారు. న్యాయమైన డిమాండ్లను ఆడబిడ్డలు అడినంత మాత్రాన అర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా? ఇదేనా మహిళలంటే ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం అని నిలదీశారు. అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదన్నారు.


ప్రచారంలో యువతను మభ్యపెట్టారు పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరాహారదీక్షలు చేసినా స్పందన లేదు, పేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదన్నారు. పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడం కాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటు అన్నారు. ఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్‌ను భుజాలపై మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి అన్నారు. ఇప్పటికైనా డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలని పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలన్నారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ జెండా వారికి అండగా ఉంటుందని, లేకపోతే ఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రభుత్వాన్ని కేటీఆర్ హెచ్చరించారు. 

newsline-whatsapp-channel
Tags : telangana fire mla brs ktr cm-revanth-reddy dsc

Related Articles