నమీబియా, నైజీరియా, భారత్.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేదవర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ యాక్టర్ రోజా కూతురు అన్షు మాలిక అవార్డు అందుకుంది. అయితే రోజా కూతురు అన్షు ప్రముఖ రచయిత్రి ..పుస్తకాలు కూడా రాసింది. చాలా సేవాకార్యక్రమాలు కూడా చేసింది. అన్షు ప్రస్తుతం అమెరికా లో చదువుకుంటుంది. అక్కడ చదువుకుంటూనే సేవాకార్యక్రమాలు చేస్తుంది. అమెరికా బ్లూమింగ్టన్లోని ఇండియానా వర్సిటీలో రోజా కూతురు అన్షు మాలిక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్స్ చదువుతుంది. తాజాగా అన్షు ప్రతిష్టాత్మకమైన మౌరీన్ బిగ్గర్స్ అవార్డు 2025–26 అందుకుంది.
ఈక్విటీ ని ప్రోత్సహిస్తున్న అన్షు లాంటి ప్రతి యేడాది అవార్డులు ఇస్తారు. ఈ యేడాది ఆ అవార్డు అన్షును వరించింది. నమీబియా, నైజీరియా, భారత్.. లాంటి దేశాల్లో వెనుకబడిన వర్గాల్లో సాంకేతిక విద్యను పెంపొందించే కోడింగ్ శిబిరాలకు నాయకత్వం వహించడం, మహిళలకు వెబ్ డెవలప్మెంట్ శిక్షణ ఇవ్వడం, సోషల్ మీడియా ద్వారా పేదవర్గాలకు సాంకేతిక విద్యను అందించడం.. ఇలాంటి అంశాలపై పరిశోధన, వాటి కోసం పనిచేసిన అంశంలో అన్షుకి ఈ అవార్డును ప్రకటించినట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయాన్ని అన్షు తన సోషల్ మీడియాలో అమెరికన్ మీడియా తన గురించి ఓ ఆర్టికల్ రాసిందని తెలిపింది. దీంతో అన్షుకు రోజా అభిమానులు అభినందనలు తెలియజేస్తున్నారు.