T20: శ్రీలంక సిరీస్‌కు కెప్టెన్‌గా సూర్య

టీమిండియా జట్టు టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించనుంది


Published Jul 18, 2024 09:44:30 AM
postImages/2024-07-18/1721312894_surya.jfif

న్యూస్ లైన్ డెస్క్: టీమిండియా టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంకలో వెళ్లనుంది. ఈ టూర్‌కు సంబంధించి బీసీసీఐ ఇప్పటికే భారత జట్టును ప్రకటించింది. టీ20 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు రోహిత్‌ శర్మ రిటైర్‌మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఫార్మాట్‌లో భారత కెప్టెన్‌ ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గురువారం బీసీసీఐ టీమిండియా సారథిగా సూర్య కుమార్ యాదవ్ ను ప్రకటించింది. టీ20 ప్రపంచకప్ తర్వాత భారత్‌కు వచ్చిన హార్దిక్‌ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. హర్ధిక్ గాయాలతో ఇబ్బందిపడుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో బీసీసీఐ, హెడ్‌కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ సూర్యకుమార్‌ను కెప్టెన్‌గా నియమించారు. రోహిత్‌, విరాట్‌ కోహ్లీ, జస్ప్రీత్‌ బుమ్రా వంటి సీనియర్‌ ఆటగాళ్లు లంక సిరీస్‌కు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అయితే రోహిత్‌ వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌లో హార్దిక్ దూరం అయ్యాడు. 

టీమిండియా స్క్వాడ్: 

టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హబ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహమ్మద్ సిరాజ్.

వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.
 

newsline-whatsapp-channel
Tags : india suryakumar-yadav india-team

Related Articles