2026 జనవరి 21 నుంచి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏపీలో క్రికెట్ సందడి మొదలైంది. ముఖ్యంగా విశాఖపట్నం వాసులకు శుభవార్త త్వరలో విశాఖలో టీమిండియా మ్యాచ్ జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్ తో టీ 20 సిరీస్ జరగనుంది. ఐదు మ్యాచ్ ల ఈ సీరిస్ లో నాలుగవ టీ 20 మ్యాచ్ కు విశాఖపట్నం వేదిక కానున్నట్లు సమాచారం.
2026 జనవరి 21 నుంచి జనవరి 31 వరకు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్లో భాగంగా నాలుగవ టీ20 మ్యాచ్ను జనవరి 28న విశాఖపట్నంలోని డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గత కొంతకాలంగా హైదరాబాద్ లేదా వైజాగ్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు పెద్దగా జరగకపోవడం కేవలం ఐపీఎల్ మ్యాచ్ లకే పరిమితమవ్వడం కావడంతో ఈ వార్త కు మరింత బలం చేకూరుతుంది.
కేవలం విశాఖపట్నంలో మాత్రమే ఒక టీ20 మ్యాచ్ జరగనుండగా, మిగిలిన నాలుగు మ్యాచ్లను నాగ్పూర్, రాయ్పూర్, గువహటి మరియు తిరువనంతపురం నగరాల్లో నిర్వహించనున్నట్లు సమాచారం. మ్యాచ్ టికెట్స్ కోసం ఇప్పటికే రంగం సిధ్దం చేస్తున్నట్లు టాక్ . దీనిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.