జస్ట్ సెలబ్రిటీ ఎండార్స్ మెంటేనా లేక రెండు దేశాల మధ్య క్షీణించిన సత్సంబంధాలు చక్కదదిద్దే ప్రయత్నం చేస్తుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ - మాల్దీవ్స్ మధ్య కొద్ది నెలలుగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. ఈ గొడవలకు తెర దించుతూ మాల్దీవ్స్ ప్రభుత్వం ఓ షాకింగ్ ప్లాన్ తో వచ్చింది. బాలీవుడ్ స్టార్ నటి, గ్లోబల్ ఐకాన్ కత్రినా కైఫ్ను తమ దేశ పర్యాటక రంగానికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. జస్ట్ సెలబ్రిటీ ఎండార్స్ మెంటేనా లేక రెండు దేశాల మధ్య క్షీణించిన సత్సంబంధాలు చక్కదదిద్దే ప్రయత్నం చేస్తుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తుంది.
‘విజిట్ మాల్దీవ్స్’ సంస్థ దీని వెనుక ఉన్న స్పష్టమైన కారణాలను వెల్లడించింది. కత్రినాను అంబాసిడర్గా ఎంపిక చేయడం తమ “సన్నీ సైడ్ ఆఫ్ లైఫ్” ప్రచారానికి సరైన ఆప్షన్ అని అభివర్ణించింది. కత్రీనా కు ప్రపంచ వ్యాప్తంగా ఫేమ్ ఉంది. ఇది కూడా మాల్దీవ్స్ టూరిజంను పెంచడానికి సాయం చేస్తుందంటున్నారు .నటిగా, వ్యాపారవేత్తగా ఆమెకున్న పాజిటివ్ ఇమేజ్ మాల్దీవ్స్ బ్రాండ్కు కలిసొస్తుందని వారి నమ్మకం.ఈ నియామకంపై స్పందించిన కత్రినా కైఫ్.. “మాల్దీవ్స్ అంటే ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతకు మారుపేరు. ప్రపంచ పర్యాటకులు గొప్ప అనుభూతి చెందేలా చేయడానికి ఈ పార్ట్నర్షిప్ ద్వారా కృషి చేస్తాను” అని చెప్పింది.
మాల్దీవ్స్ చేసిన దానికి ప్రధాని మోదీ లక్ష ద్వీప్ లో పిక్స్ తీసి పోస్ట్ చేశారు. దీంతో బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ సోషల్ మీడియాలో నడిచింది.ఇప్పుడు, భారతీయ స్టార్ నటిని అంబాసిడర్గా నియమించడం ద్వారా మాల్దీవ్స్ ఈ స్పష్టమైన సంకేతాలను పంపుతోంది. భారత్ తో సంబంధాలను పునరుద్దరించుకోవాలనే ఆసక్తి తమకు ఉందని చెప్పడమే అంటున్నారు. వివాదం ఉన్నప్పటికీ మాల్దీవ్స్ పర్యాటక శాఖ ప్రకారం ఈ సంవత్సరం జూన్ 7 నాటికి ఆ దేశానికి వచ్చిన మొత్తం పర్యాటకుల సంఖ్య 10 లక్షలు దాటింది. కత్రినా కైఫ్ ప్రచారంతో మరింత టూరిస్టులు పెరుగుతారని నమ్ముతుంది మాల్దీవ్స్,