Sai Dhrama Tej: వరద బాధితులకు సాయి ధరమ్ తేజ్ విరాళం

వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు.


Published Sep 04, 2024 10:40:31 AM
postImages/2024-09-04/1725464353_saidharam.PNG

న్యూస్ లైన్ సినిమా: గత మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సెలబ్రిటీలు తమ వంతు సాయం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ భారీ విరాళాన్ని ప్రకటించారు.  తెలంగాణకు 10 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు విరాళాన్ని ప్రకటించారు. ఇక ఈ విషయాని ధరమ్ తేజ్ బుధవారం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు పడుతున్న కష్టాల్ని చూసి నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకి చెరో 10 లక్షలు అందిస్తున్నాను. అదే విధంగా విజయవాడలో నేను మన మెగా అభిమానులు, జనసైనికులు నడిపిస్తున్న అమ్మ ఆశ్రమం, ఇతర స్వచ్ఛంద సంస్థలకు 5 లక్షలు అందిస్తున్న. మొత్తం 25 లక్షలు నా వంతు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ కష్టాలన్నీ త్వరగా సమసిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ.. మీ సాయి ధరమ్ తేజ్ అంటూ పోస్టులో మెగా హీరో రాసుకోచ్చారు. 

newsline-whatsapp-channel
Tags : telangana andhrapradesh tollywood hero- saidharamtej floods

Related Articles