జియో వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ లో అలాగే మొబైల్ కాల్స్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : భారత్ లో అత్యంత ప్రజాదారణ పొందిన అతి పెద్ద టెలికాం కంపెనీలో ఒకటైన జియో సర్వర్ డౌన్ అయ్యింది. జియో వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్ లో అలాగే మొబైల్ కాల్స్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటారు. దీంతో పాటు జియో బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ అంటే జియో ఫైబర్ ను కూడా ఉపయోగించలేకపోతున్నారు.
ఏదైనా ప్లాట్ఫామ్ సర్వర్ డౌన్ స్టేటస్ను అందించే ప్రముఖ వెబ్సైట్ డౌన్డెటెక్టర్ ప్రకారం, దాదాపు 12,000 మంది జియో వినియోగదారులు జియో నెట్వర్క్లోని సమస్యలపై ఫిర్యాదు చేశారు. ఈ వివరాల కోసం డౌన్ డెటెక్టర్ ప్రకారం ఈ రోజు అంటే 16 జూన్ 2025 న మధ్యాహ్నం 1:37 గంటల నుంచి ప్రజలు జియో నెట్ వర్క్ ను ఉపయోగించడంలో సమస్యలను ఎదుర్కొంటున్నారు. దాదాపు అరగంట తర్వాత అంటే మధ్యాహ్నం 2.20 గంటల నాటికి 12,098 మంది యూజర్లు జియో నెట్ వర్క్ లోని సమస్యలపై ఫిర్యాదు చేశారు. అంటే ఈ అరగంటలో దేశవ్యాప్తంగా ప్రజలు జియో నెట్ వర్క్ ను ఉపయోగించడంలో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు.
సౌత్ ఇండియాలోనే ఎక్కువ సమస్యలు: జియో నెట్వర్క్లో ఎక్కువ సమస్యలు దక్షిణ భారత రాష్ట్రాలలోని ప్రజలు ఎదుర్కొంటున్నారు. డెటెక్టర్ ప్రకారం మధురై, కోయంబత్తూర్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబయి, సూరత్, అహ్మదాబాద్, నాగ్పూర్, దిల్లీ, చండీగఢ్, పాట్నా, గౌహతి, కోల్కతా, కటక్ వంటి నగరాల్లో కూడా జియో నెట్వర్క్ వినియోగంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశాలపై జియో ఏం స్పందించలేదు. జియో నెట్ వర్క్ పై పిర్యాధులు, ఫన్నీ పోస్టులతో నిండిపోయింది.