AP: ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనం

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనం అయ్యింది


Published Aug 14, 2024 08:55:30 PM
postImages/2024-08-14/1723649130_botsa.PNG

న్యూస్ లైన్ డెస్క్: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనం అయ్యింది. బలం లేకపోవడంతో పోటీలో నుంచి టీడీపీ తప్పుకుంది. ఇక స్వతంత్ర అభ్యర్థి షఫీ కూడా నామినేషన్‌ ఉపసంహరించడంతో బొత్స విజయం ఖాయం అయింది. ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా రిటర్నింగ్‌ అధికారి ప్రకటించనున్నారు. విశాఖ కలెక్టరేట్‌ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ పార్టీ వ్యూహం ఫలించింది. తమ సంఖ్యా బలం పెంచుకోలేమని తెలిసి టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని టీడీపీ ప్రయత్నించింది. కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు ప్రవాహంలా టీడీపీలో వచ్చిచేరుతారని ఊహించారు. అందుకని ఎమ్మెల్సీ పోటీ ఆశావహులు పెరిగారు. పదవిపై ఆసక్తి చూపిన పీలా గోవింద సత్యనారాయణ, గండి బాబ్జి, పివిజి.కుమార్‌, బత్తుల తాతయ్యబాబు పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు పరిశీలనకు పంపారు. వీరెవరూ కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టడానికి ముందుకురాకపోవడంతో బైరా దిలీప్‌చక్రవర్తి పేరు తెరమీదకు తెచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీచేసే అవకాశం రాని దిలీప్‌ చక్రవర్తిని ఎమ్మెల్సీగా పోటీలో పెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ పార్టీ ప్రకటిచింది. దీంతో పోటీలో గెలవలేమని టీడీపీ ఆశాలు వదిలేసింది.
 

newsline-whatsapp-channel
Tags : chandrababu andhrapradesh jagan mlc- byelections

Related Articles