Alleti: మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలి

రుణమాఫీకి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్ర విమర్శాలు చేశారు.


Published Jul 30, 2024 09:17:48 AM
postImages/2024-07-30/1722348450_alleti333.PNG

న్యూస్ లైన్ డెస్క్: రుణమాఫీకి 30 వేల కోట్లకు పైగా బడ్జెట్ అవసరం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అంత బడ్జెట్ పెట్టలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తీవ్ర విమర్శాలు చేశారు. మంగళవారం అసెంబల్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 70 లక్షల మంది రైతులు తెలంగాణలో ఉన్నారు. కానీ ఇందులో కోత విధించినట్లు ఆయన ఆరోపించారు. ఏ ప్రాతిపాదికన రైతులను ఎంపిక చేసారు అని ప్రభుత్వాన్ని నిలదీశారు. వరంగల్ సభలో ఎటువంటి నిబంధనలు లేకుండా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ఒప్పుకున్నారు. మెలికలు లేకుండా రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఈ ఏడాది రైతుబంధు పడలేదని, ప్రభుత్వం వెంటనే ఈ సీజన్ రైతుబంధు నిధులు విడుదల చేయాలని కోరారు. రైతు బందుకు, రైతు భరోసాకు వేర్వేరు నిధులు కేటాయించాలని సూచించారు. రైతు భరోసా పై అసెంబ్లీ లో చర్చ పెడతామని సీఎం చెప్పారు. చర్చ ఎప్పుడు పెడతారో చెప్పాలని కోరారు. కౌలు రైతు ల గోస పట్టించుకునే నాథుడే లేడు అని, తెలంగాణలో దాదాపు 15 లక్షల కౌలు రైతులు ఉన్నారని తెలిపారు. వారు మీరిచ్చిన హామీతో మీకు ఓటేశారు అని, కౌలు రైతులకు ఇస్తామన్న పెట్టుబడి సహాయం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. రైతులకు పంట బోనస్ 500 ఇవ్వాలని, ఎన్నికల హామీలు భారేడు నిధులు మాత్రం జానెడు అనే విధంగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.

 
బడ్జెట్ అంకెల గారడీగా ఉందని, వ్యవసాయానికి 49 వేల కోట్లు అవసరం అని చెప్పారు. కానీ బడ్జెట్లో 31 వేల కోట్ల ఇచ్చారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న బియ్యంకు బోనస్ ఇస్తామని చెప్పడం రైతులను మోసం చేయడమే అని అన్నారు. ఇన్పుట్ సబ్సిడీ ఎప్పటిలోగా ఇస్తారు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో 7 నెలల్లో 150 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భూమాత పోర్టల్ వచ్చేది ఎప్పుడు అని, భూ సర్వేతో నష్టపోయిన ఎంత మందికి మీరు న్యాయం చేశారు అని నిలదీశారు. రెవెన్యూ ట్రిబ్యునల్ కసరత్తు మొదలైందా? పేదల భూములు లాక్కున్నారని, ఆ భూములు వెనక్కి తీసుకొని న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాటేమిటి అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 24 లక్షల ఎకరాల అసైన్ భూమి ఉండే, ఇప్పుడు 5 లక్షల మాత్రమే ఉందని అవి ఎవరు లాక్కున్నారు? దాన్ని లెక్క ఏమైనా తెలిసిందా? దానిపై ఎంక్వైరీ ఏమైనా వేశారా? దీనిపై సీబీఐ ఎంక్వైరీ కి సిద్ధమా? కాళేశ్వరం స్కాం ను సీబీఐ ఎంక్వైరీకి ఇచ్చేందుకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు అని ప్రశ్నల వర్షం కురిపించారు.


ధరణి పోర్టల్ విదేశీ కంపెనీ అధీనంలో ఉందని, విదేశీ కంపెనీకి అప్పజెప్పెందుకు బాధ్యులు ఎవరు? దీనిపై ఇప్పటి వరకు విచారణ చేయలేదన్నారు. దీని వెనకున్న మతలబు ఏమిటి? లక్షల ఎకరాల భూమి బాకాసురులు తింటే ఎందుకు ఎంక్వైరీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు అని నిలదీశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నేరవేర్చకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కు కౌంటర్ ఇస్తూ.. రెండు రోజుల క్రితం కేంద్రం రాష్ట్రానికి ఏమిచ్చింది అనేది వివరించామని, కేంద్రం ఇచ్చిన నిధుల మీద చర్చకు నేను సిద్ధం అని సవాల్ చేశారు. ధరణిలో జరిగిన అవినీతిపై విచారణ అడిగితే సబ్జెక్ట్ డివియేట్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఉన్న అవగాహన ఒప్పందం అర్థం అవుతుందన్నారు. మీతో కాకుంటే సీబీఐకి సిఫార్సు లేఖ రాయండి, 24 గంటల్లో సీబీఐ ఆమోదం తీసుకొచ్చే బాధ్యత మాది అని ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


 

newsline-whatsapp-channel
Tags : telangana mla congress bjp cm-revanth-reddy runamafi maheshwar-reddy

Related Articles