BJP: హలాల్ మీద రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లింలు హలాల్ చేయాటంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


Published Jul 29, 2024 09:10:40 AM
postImages/2024-07-29/1722262224_rajasingh.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముస్లింలు హలాల్ చేయాటంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం గోషామహల్‌లోని స్థానిక అమ్మవారి దేవాలయంలో నిర్వహించిన బోనాలు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాలు పండుగలో మన హిందువులు, మన కుటుంబం బాగుండాలని మేకని అమ్మవారికి సమర్పిస్తారు. కానీ ఆ మేకని బలి ఇచ్చే వాళ్ళు ముస్లింలు అని అన్నారు. వాళ్ళు బలి ఇచ్చే ముందు వాళ్ళ ఫాతియా చదివి హలాల్ చేసి కోస్తారని ఆరోపించారు. కాబట్టి మనం మన అమ్మవారికి ఎంగిలి బలి ఇవ్వకూడదు కోరారు. ప్రజలందరూ హలాల్‌ని బహిష్కరణ చేద్దామని ఎమ్మెల్యే రాజ సింగ్ పిలుప్పునిచ్చారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana mla bjp bonalu-festival rajasingh

Related Articles